ETV Bharat / bharat

పదో తరగతి తెలివితేటలతో 'డ్రగ్స్'​ ల్యాబ్.. చివరకు?

author img

By

Published : Nov 13, 2021, 11:37 AM IST

ఓ యువకుడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. యూట్యూబ్​లో చూసి, మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఓ మినీ ల్యాబ్​ను(Lab for drugs) ఏర్పాటు చేశాడు. కానీ, చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

gujarat drugs
గుజరాత్​లో డ్రగ్స్​

జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు యువకులు. వాటి ద్వారా ఎదురయ్యే పరిణామాలను సైతం లెక్క చేయటం లేదు. గుజరాత్​కు చెందిన ఓ యువకుడు.. చదివింది పదో తరగతే అయినా మత్తుపదార్థాల్ని తయారు చేసేందుకు ఏకంగా ఓ మినీ ల్యాబ్​నే ఏర్పాటు చేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

యూట్యూబ్​లో చూసి..

సూరత్​లోని(Gujarat Surat News) వరచ్చా ప్రాంతంలో నివసించే జైమన్ సావనీ.. పదో తరగతి పాస్ అయ్యాడు. లాక్​డౌన్​లో అతడు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్​ తయారు చేసి, అమ్మాలనుకున్నాడు. దాంతో యూట్యూబ్​లో చూసి, గుట్టుగా ఓ మినీ ల్యాబ్​ను(Lab for drugs) ఏర్పాటు చేశాడు. అయితే.. సూరత్​ ఎస్​ఓజీ అధికారులు అతని ల్యాబ్​పై దాడులు చేసి అరెస్టు చేశారు.

సర్తానాలోని రాజ్​వీర్​ కాంప్లెక్స్​లో సావనీ కార్యాలయంపై పోలీసు బృందం దాడులు జరిపింది. డ్రగ్స్ తయారు చేసేందుకు వినియోగించే ల్యాబ్​ పరికరాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

"సావనీని అతని స్వస్థలమైన భావ్​నగర్ జిల్లాలో అరెస్టు చేసి, సూరత్​కు తీసుకువచ్చాం. తాను మత్తుపదార్థాలకు బానిసయ్యానని సావనీ అంగీకరించాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అతడు మత్తుపదార్థాలను విక్రయించడం ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా మెథాంఫేటమిన్ అనే డ్రగ్​ తయారు చేసేందుకుగాను అతడు తన ఆఫీసులో ఓ మినీ ల్యాబ్​ను ఏర్పాటు చేశాడు.యూట్యూబ్​లో చూసి సావనీ.. డ్రగ్స్​ తయారు చేయడం నేర్చుకున్నాడు. రాజస్థాన్​కు చెందిన కొందరు డ్రగ్స్ వ్యాపారుల ఈ విషయంలో అతనికి సాయం చేశారు. ఆన్​లైన్​లో అతడు తన ల్యాబ్​కు కావాల్సిన పరికరాల కొనుగోలు చేశాడు"

-అజయ్​ తోమర్​, సూరత్ ఎస్పీ

ఈ రాకెట్​లో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? రసాయన పదార్థాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఇద్దరు ఉద్యోగస్థులను కిడ్నాప్ చేసిన నక్సలైట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.