గుజరాత్ సూరత్లోని హజీరాలో దారుణం జరిగింది. స్మార్ట్ఫోన్లో గేమ్స్కు బానిసైన 17 ఏళ్ల కుమారుడు కన్నతండ్రినే హత్య చేశాడు. గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకే ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఈ విషయాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
ఇచ్చాపుర్కు చెందిన 40 ఏళ్ల అర్జున్.. తన కుమారుడు రోజంతా ఫోన్లో గేమ్ ఆడటాన్ని గమనించి వద్దని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మైనర్.. తండ్రితో గొడవపడ్డాడు. ఆవేశంతో అతని గొంతుకోసి చంపాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా తెలియకుండా దాచాలనుకున్నాడు. శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి.. జారిపడిపోయినట్లు చిత్రీకరించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఇది హత్య అని వైద్యులు నిర్ధరించారు. దీంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయపడింది.
తన కుమారుడే ఈ పని చేశాడని తెలిసి తల్లి షాక్కు గురైంది. అతడిపై కేసు పెట్టింది.
ఇదీ చదవండి: ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు