ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Oct 20, 2021, 12:30 PM IST

ENCOUNTER IN KASHMIR TODAY NEWS
కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో (Encounter in Kashmir) భద్రతా దళాలు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు (Encounter in Kashmir) జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు.

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో (Encounter in Kashmir) ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. (Militants killed in Kashmir today)

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు... ద్రాగడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి బలగాలు. భద్రతా సిబ్బందిని చూడగానే ముష్కరులు కాల్పులు చేశారని పోలీసులు తెలిపారు. ప్రతిగా బలగాలు సైతం కాల్పులు (Encounter in Kashmir) జరపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని (Militants killed in Kashmir today) చెప్పారు. ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

మృతి చెందిన ఉగ్రవాదులను గుర్తించే పనిలో పడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Non Kashmiri Migrants: ఉండిపోతే ప్రాణభయం.. ఊరెళ్తే పస్తుల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.