ETV Bharat / bharat

'సొంతవాళ్లే మోసం చేశారు!'.. ఉద్ధవ్​ తీవ్ర భావోద్వేగం.. ఇక గుడ్​బై!!

author img

By

Published : Jun 29, 2022, 7:13 PM IST

UDDHAV NCP JAYANT PATIL
UDDHAV NCP JAYANT PATIL

Uddhav Thackeray emotional: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నరేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వం సాగిన తీరును గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్, ఎన్​సీపీ మద్దతు ఇచ్చినా.. దురదృష్టవశాత్తూ సొంత వాళ్లే తనను విస్మరించారని కేబినెట్​ భేటీలో అన్నారు.

Uddhav Thackeray cabinet meet: సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబావుటా.. ప్రత్యర్థి పార్టీ రాజకీయ వ్యూహాలు.. బలపరీక్షలో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితి... ఇలాంటి పరిణామాల మధ్య ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో బుధవారం ముంబయిలో సమావేశమైంది ఆ రాష్ట్ర మంత్రివర్గం. ఔరంగాబాద్​, ఒస్మానాబాద్ వంటి ప్రాంతాలకు పేర్లు మార్చాలన్న నిర్ణయాలకు తోడు.. మరికొన్ని కీలక పరిణామాలకు కేబినెట్ భేటీ వేదికైంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

"మూడు పార్టీలు(శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్) కలిశాయి. రెండున్నరేళ్లు మంచి పనిచేశాయి. అందరికీ కృతజ్ఞతలు. గురువారం బలపరీక్ష జరిగితే.. ఇది ఇక్కడితో అంతమైపోతుందో లేక కొనసాగుతుందో తేలిపోతుంది. కాంగ్రెస్, ఎన్​సీపీ నాకు మద్దతుగా నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ నా సొంత పార్టీ వాళ్లు నాకు అండగా లేరు" అని ఉద్ధవ్​ వ్యాఖ్యానించినట్లు మంత్రి, ఎన్​సీపీ నేత జయంత్ పాటిల్ కేబినెట్ భేటీ తర్వాత వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.