ETV Bharat / bharat

దిల్లీలో లాక్​డౌన్​ మరో వారం పొడిగింపు!

author img

By

Published : May 23, 2021, 6:11 AM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగించే దిశగా అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

lockdown, kejriwal
దిల్లీలో లాక్​డౌన్​ మరో వారం పొడిగింపు!

దేశరాజధాని దిల్లీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటితో పాటే పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. నగరంలో కొవిడ్​ పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు భావిస్తున్నప్పటికీ.. కేజ్రీవాల్​ సర్కార్​ లాక్​డౌన్​ను పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగించవచ్చని పేర్కొన్నాయి.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్​ 19న దిల్లీలో లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. చివరగా మే16 న లాక్​డౌన్​ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం కొత్తగా 2,200 కొత్తకేసులు వెలుగు చూసినట్లు సీఎం కేజ్రీవాల్​ తెలిపారు. అదే సమయంలో పాజిటివిటీ రేటు 3.5 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన వైరస్​ బలహీనపడినట్లు కాదని వెల్లడించారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: 'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.