ETV Bharat / bharat

పీఎన్​బీ ఫ్రాడ్​ కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్

author img

By

Published : Apr 12, 2022, 2:15 PM IST

PNB Fraud Case: పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ స్కామ్​ కేసులో మరో కీలక నిందితుడు సుభాష్​ శంకర్​ పరబ్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. నిందితుడిని ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించింది. 2018లో నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీతో కలిసి విదేశాలకు పరారయ్యాడు సుభాష్.

PNB Fraud Case
పంజాబ్​ నేషనల్

PNB Fraud Case: పంజాబ్ నేషనల్ బ్యాంక్​ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ కీలక వ్యక్తిని అరెస్ట్​ చేసింది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీకి అత్యంత సన్నిహితుడు.. సుభాష్​ శంకర్​ పరబ్​ను ఇంటర్​పోల్​ సాయంతో అరెస్ట్​ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సుభాష్ శంకర్​పై ఇంటర్​పోల్ ఇదివరకే రెడ్​ కార్నర్​ నోటీసును జారీ చేసింది. నిందితుడిని ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించింది సీబీఐ.

PNB Fraud Case
నిందితుడు సుభాష్​ శంకర్

నిందితుడు కైరోలో తలదాచుకున్నట్లు అందిన సమాచారాన్ని నిర్ధరించుకున్న తర్వాతే ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టామని.. ఈ క్రమంలో అతడిని భారత్​కు రప్పించడానికి విదేశాంగ శాఖ సహకారం పొందినట్లు అధికారులు వెల్లడించారు. సుభాష్​ను ముంబయిలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో మంగళవారం హాజరుపరచనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అతడిని రిమాండ్​కు తరలించాలని సీబీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ స్కామ్​లో కీలక పాత్ర పోషించిన 49 ఏళ్ల సుభాష్​ శంకర్​.. 2018లో నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీతో కలిసి విదేశాలకు పరారయ్యాడు. నిందితుడిపైన నాలుగేళ్ల క్రితమే సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇంటర్​పోల్​ను హెచ్చరించింది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్​పోల్​ సాయంతో సుభాష్​ను పట్టుకున్నారు.

ఇదీ చూడండి : ''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.