ETV Bharat / bharat

దేశ ప్రజలకు మోదీ రిపబ్లిక్​ డే శుభాకాంక్షలు

author img

By

Published : Jan 26, 2021, 7:32 AM IST

Updated : Jan 26, 2021, 8:44 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'హ్యాపీ రిపబ్లిక్​ డే. జై హింద్' అని ట్వీట్ చేశారు.

Wishing all the people of India a Happy #RepublicDay . Jai Hind!" tweets Prime Minister Narendra Modi
దేశ ప్రజలకు మోదీ రిపబ్లిక్​ డే శుభాకాంక్షలు

దేశ ప్రజలందరికీ ట్విట్టర్​ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. 'హ్యాపీ రిపబ్లిక్​ డే. జై హింద్'​ అని హిందీ, ఆంగ్ల భాషలో ట్వీట్​ చేశారు.

  • देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!

    Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!

    — Narendra Modi (@narendramodi) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

72వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే రెండో గణతంత్ర వేడుకల్లో ఈసారి అతిథులు ఎవరూ హాజరుకావడం లేదు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ను తొలుత ఆహ్వానించినప్పటికీ.. యూకేలో కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది.​

బ్రిటన్​ ప్రధాని..

బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం నిర్మించిన రాజ్యాంగం అసాధారణమైనదని కొనియాడారు. త్వరలోనే భారత్‌లో పర్యటించాలన్న తన ప్రణాళికను పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి: రిపబ్లిక్ డే: దిల్లీలో భద్రత కట్టుదిట్టం

Last Updated : Jan 26, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.