ETV Bharat / bharat

'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి-74వేలు దాటిన కేసులు

author img

By

Published : Jun 3, 2020, 9:08 PM IST

భారత్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 2లక్షలకు పైగా వైరస్ బారినపడ్డారు. 5,800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​, దిల్లీల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

corona cases
భారత్​పై కరోనా పంజా

భారత్​లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు, దిల్లీ, రాజస్థాన్​లపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఒక్కరోజులో 2,560మందికి కరోనా నిర్ధరణ అయింది. కొత్తగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 74,860కి పెరిగింది.

గుజరాత్​లో కొత్తగా 485మందికి..

గుజరాత్​లో కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఒక్కరోజులో 485 మందికి వైరస్ సోకింది. 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 18,117 మంది వైరస్ బారిన పడగా.. 1,122 మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్​లో ఏడుగురు మృతి..

మధ్యప్రదేశ్​లో కొత్తగా 168 మందికి వైరస్ సోకింది. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 8,588 కి చేరింది. 371మంది మృతి చెందారు. ఇప్పటివరకు 5,445 మందిలో మహమ్మారి నయమవగా.. 2,772 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చెన్నైలో 17వేలు దాటిన వైరస్ కేసులు..

తమిళనాడులో కొత్తగా 1,286మందికి వైరస్​ సోకింది. 11మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 25,872కు చేరింది. రాజధాని చెన్నైలో 17,598మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 208కి పెరిగింది.

కర్ణాటకలో 267మందికి వైరస్..

కర్ణాటకలో ఒక్కరోజు వ్యవధిలో 267మందికి కరోనా సోకింది. ఒకరు వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 4,063కు పెరిగింది. ఇప్పటివరకు 53 మంది మృతి చెందారు.

జమ్ముకశ్మీర్​లో..

జమ్ముకశ్మీర్​లో వైరస్ బాధితుల సంఖ్య 2,718కి పెరిగింది. ఇప్పటివరకు 33మంది ప్రాణాలు కోల్పోయారు. 953మందిలో వైరస్ యాక్టివ్​గా ఉంది.

ఉత్తర్​ప్రదేశ్​లో ..

ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ బాధితుల సంఖ్య 8,870కి పెరిగింది. 230మంది మహమ్మారికి బలయ్యారు. 5,257మందిలో వైరస్ యాక్టివ్​గా ఉంది.

ఇదీ చూడండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.