ఎస్టీ, ఎస్టీ చట్ట సవరణ-2018 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారం కేసు నమోదు కాని పక్షంలో మాత్రమే కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.
అట్రాసిటీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని.. బాధితులకు న్యాయం చేయాలని విన్నవిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నూతన చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు ఎలాంటి ప్రాథమిక విచారణ అవసరం లేదని.. సీనియర్ అధికారుల అనుమతితో పనిలేదని పేర్కొంది.
ప్రతి ఒక్కరు ఎదుటి వారిని సమానంగా చూడాలని.. సోదరభావంతో ఉండాలని ఈ సందర్భంగా సూచించింది ధర్మాసనం. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు కాని పక్షంలో ఎఫ్ఐఆర్ను కోర్టు కొట్టి వేయగలదని.. ముందస్తు బెయిల్ అనేది పార్లమెంట్ ఉద్దేశాన్ని నీరుగారుస్తుందని పేర్కొంది ధర్మాసనం.
ఇదీ చూడండి: దిల్లీ ఓటింగ్ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?