ETV Bharat / bharat

దేశం​లో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి

author img

By

Published : Mar 31, 2020, 10:06 PM IST

భారత్​లో కరోనా ఉద్ధృతి విధ్వంసకరంగా సాగుతోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 35 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

COVID19 cases in india
భారత్​లో కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 35కు చేరింది. తాజాగా పంజాబ్​లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

గత 24 గంటల్లో కొత్తగా 146 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,397కి చేరింది.

మొత్తం కేసుల్లో 1,238 మంది బాధితులకు ప్రస్తుతం చికిత్స నిర్వహిస్తుండగా... 123 మందిని డిశ్చార్జి చేశారు. ఒకరు దేశం విడిచి వెళ్లారు.

దేశంలో అత్యధికంగా మహరాష్ట్ర, కేరళలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 72 మందికి వైరస్ సోకింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.