ETV Bharat / bharat

పరీక్షల రద్దు కోరుతూ సీజేఐకి విద్యార్థుల లేఖ

author img

By

Published : May 25, 2021, 7:37 PM IST

supreme court
సుప్రీంకోర్టు

కరోనా విజృంభణ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలనే సీబీఎస్​ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని 300 మంది 12వ తరగతి విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాశారు.

దేశంలో కరోనా ఉద్ధృతి నెలకొన్న తరుణంలో పరీక్షలు నిర్వహించాలన్న సీబీఎస్​ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాశారు విద్యార్థులు. సుమారు 300 మంది 12వ తరగతి విద్యార్థులు భౌతికంగా పరీక్షలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని లేఖ ద్వారా పిటిషన్​ పంపారు.

పరీక్షలకు బదులుగా.. తమ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ మదింపు పద్ధతులను అనుసరిచాలని కోరారు విద్యార్థులు.

ఇవీ చదవండి: 'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు'

51 మొక్కలే వరకట్నం- ఎందరికో ఆదర్శం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.