ETV Bharat / bharat

కష్టకాలంలో కూలీ సాహసం- కాలి నడకన హైదరాబాద్​ టూ అసోం!

author img

By

Published : Nov 26, 2021, 5:52 PM IST

Updated : Nov 26, 2021, 8:08 PM IST

ఉపాధి కోసం అసోం నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్​కు వచ్చిన ఓ కూలీని(migrant labour) మేస్త్రీ​ మోసం చేయటం వల్ల పెద్ద సాహసం చేయాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక, తినేందుకు తిండి లేకపోటం వల్ల కాలి నడకన సొంత రాష్ట్రానికి పయనమయ్యాడు ఆ కూలీ. మూడు నెలలుగా సుమారు 650 కిలోమీటర్లు నడిచాడు. ఇంతకీ తమ వారిని చేరుకున్నాడా?

Ajay Bodule
అజయ్​ బోడులే

కాలి నడకన హైదరాబాద్​ నుంచి అసోంకు

హైదరాబాద్​లో కూలీ పని ఎక్కువగా ఉంటుందని ఓ మేస్త్రీ చెప్పిన మాటలు నమ్మి.. సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు అసోం నాగావ్​ జిల్లాకు చెందిన అజయ్​ బోడులే(migrant labour). హైదరాబాద్​ చేరుకున్నాక భవన నిర్మాణ పనుల్లో చేరాడు. అయితే, అతడ్ని తీసుకొచ్చిన మేస్త్రీ​ ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. మూడు రోజులైనా.. అతని ఆచూకీ లేకపోవటం, వేతనం చెల్లించకపోవటం వల్ల అజయ్(assam labour)​ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు.

ఎవరిని అడగాలో తెలియదు. సాయం చేసే వారు లేరు. విసుగు చెందిన అజయ్​.. తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల తన కాళ్లనే నమ్ముకున్నాడు. మూడు నెలల క్రితం నడక ప్రారంభించాడు. మార్గం మధ్యలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునేవాడు అజయ్​. ఏదీ దొరకని సమయంలో మంచి నీళ్లతో సరిపెట్టుకునేవాడు.

" నాపేరు అజయ్​ బోడులే. మా గ్రామం పేరు నంబర్​. అసోంలోని నాగావ్​ జిల్లా. ఇంటి వద్ద మా అన్న, తమ్ముడు ఉంటారు. ఓ మేస్త్రీ నన్ను హైదరాబాద్​ తీసుకొచ్చాడు. నెలకి రూ.25వేల వరకు వేతనం వస్తుందని నమ్మించాడు. నేను అక్కడికి వచ్చి 8,9 నెలలు అవుతోంది. హైదరాబాద్​లో సెంట్రింగ్​ పనులు చేశాను. "

- అజయ్​ బోడులే, బాధితుడు

650 కిలోమీటర్లు ప్రయాణించి మల్కాన్​గిరి జిల్లా సరిహద్దుల గుండా ఒడిశాలోకి ప్రవేశించాడు అజయ్​. ఇటీవలే కొరాపుట్​ జిల్లాలోని లక్ష్మిపుర్​కు చేరుకున్నాడు. గువాహటికి వెళ్లే దారి ఏదని స్థానికులను అడుగుతుండగా.. నరేంద్ర గరాడా అనే సామాజిక కార్యకర్త చూసి వివరాలు కనుక్కున్నారు. హైదరాబాద్​ నుంచి గువాహటికి కాలినడకన ప్రయాణం ఎందుకు చేయాల్సి వస్తోందో తెలుసుకుని చలించిపోయారు. అజయ్​ను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. గువాహటికి చేర్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. లక్ష్మీపుర్​కు సమీపంలోనే రైల్వే సొరంగం పనుల్లో కొంత మంది అసోం కూలీలు పని చేస్తున్నారని తెలుసుకుని.. వారి వద్దకు అజయ్​ను తీసుకెళ్లారు నరేంద్ర. బాధితుడి వివరాలు తెలుసుకున్న అక్కడి వారు.. అతనికి పని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన బంధువుల సమాచారం అందే వరకు వారితో కలిసి పనిచేయాలని అజయ్​ నిర్ణయించుకున్నాడు. కానీ అజయ్​ విధుల్లో చేరి మూడు రోజులు గడిచినా ఇంకా ఎలాంటి పురోగతి లేదు.

ఇదీ చూడండి: నది ఒడ్డున బట్టలు, సైకిళ్లు.. ఏంటా అని చూస్తే ఆ ముగ్గురు శవాలై...

Last Updated : Nov 26, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.