మళ్లీ అదే సీన్​ - తునిలో తుస్సుమన్న వైసీపీ సామాజిక సాధికార యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 9:58 PM IST

thumbnail

YCP Bus Yatra in Kakinada District : వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న మద్దతు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా.. వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ.. ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో.. ప్రజల నుంచి స్పందన లేక.. మంత్రులు నోర్లు వెల్లబెట్టాల్సిన పరిస్థితులు నెలకొంది. తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన లేక వెలవెలబోయింది. 

వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర.. తుస్సుమంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే జనమంతా బయటకు వెళ్లిపోయారు. మంత్రులు దాడిశెట్టి రాజా, అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రులు పాల్గొన్న సభలో పెద్దసంఖ్యలో జనసమీకరణ చేశారు. అయినప్పటికీ మంత్రుల ప్రసంగం ప్రారంభం కాగానే జనమంతా బయటకు వెళ్లిపోయారు. మొత్తం కుర్చీలు అన్ని ఖాళీ కావడంతో మంత్రులు ఖాళీ కూర్చీలకే ప్రసంగాలు చేయల్సిన పరిస్థితి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.