దాడులతో అట్టుడుకుతున్న రాష్ట్రం- సీఎం జగన్​ సైలెంట్ - Jagan Not Respond to Attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 7:09 AM IST

thumbnail
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై స్పందించని జగన్‌ - ప్రతిపక్షనేతలపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులు (ETV Bharat)

CM Jagan Not Responding to Attacks in AP : పోలింగ్ అనంతరం దాడులు, విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా సీఎం జగన్ కనీసం దాడులను ఖండిచక పోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై జగన్‌ కనీసం స్పందించలేదు. ఈనెల 13న ఉదయం 8 గంటల సమయంలో కడపలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా మీడియా కంట పడలేదు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున దాడులు, విధ్వంసాలు జరిగాయి. 

తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నేతలు, మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా మాచర్లలోనూ దాడులు, విధ్వంసాలకు దిగారు. తాడిపత్రిలోనూ భారీగా రోడ్లపైకి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు కూటమి నేతలు, కార్యకర్తలపై దాడులు చేశాయి. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దాడులను అన్ని రాజకీయ పార్టీలనేతలూ ఖండించారు. సీఎంగా , వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా జగన్ దాడులు నియంత్రించేలా కనీసం పిలుపు ఇవ్వలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌కు రాష్ట్రంలో పరిస్థితులను మెరుగుపరచే బాధ్యత లేదా అనే చర్చ సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.