అరాచకమా- బుర్రపనిచేయడం లేదా! రోడ్డు మూసేసి వైసీపీ బస్సు యాత్ర నిర్వహించడంపై జనం గగ్గోలు !

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 10:11 PM IST

thumbnail

Road Blocked for YCP Bus Yatra in Yemmiganur: అధికార వైసీపీ బస్సు యాత్ర ఓ వైపు ఘోరంగా విఫలం అవుతుండగా, మరోవైపు ఆ పార్టీ నేతల తీరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. యాత్ర జరిగిన ప్రాంతంలో రహదారులను మూసివేస్తున్నారు. ప్రజలు ఎవరూ యాత్రలో పాల్గొనేందుకు రాకపోయినా, పెద్ద సంఖ్యలో కుర్చీలను తీసుకొచ్చి వేస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లేందుకు దారి లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇదే విధంగా ఎమ్నిగనూరులో జరిగింది. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. బస్టాండ్ బయట ప్రధాన రహదారిపై వేయడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్, సోమప్ప కూడలి వద్ద ప్రధాన రహదారికి బ్యారికేడ్లు పెట్టి మూసివేశారు. దీంతో బస్టాండ్​కు వెళ్లే ప్రయాణీకులు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. మరోవైపు దారి మూసివేతతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాల యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారిని మూసివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.