పట్టాలు తప్పిన గూడ్స్​ ట్రైన్​.. 8 రైళ్లు రద్దు.. సహాయక చర్యలు ముమ్మరం

By

Published : Jul 15, 2023, 3:56 PM IST

thumbnail

Goods Train Derails Near Jaipur : దేశంలో గత కొద్దిరోజులుగా వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్​లోని జైపుర్​ జిల్లాలో ఓ గూడ్స్​ రైలుకు సంబంధించిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం జరిగిందీ ఘటన.

జైపుర్-మదార్ రైల్వే సెక్షన్‌లో జాబ్నర్, హిర్నోడా స్టేషన్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు (నెంబర్​- PJCR-ALKP ) పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పలు ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వెళ్లే 8 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రైలు రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

జైపుర్- మార్వార్ (19735), మార్వార్- జైపుర్ (19736), జైపుర్- జోధ్‌పుర్ (22977), జోధ్‌పుర్- జైపుర్ (22978), అజ్మేర్- జైపుర్ (09605), జైపుర్- అజ్మేర్ (09606), జైపుర్- ఉదయ్‌పుర్ (09721), జైపుర్- సూరత్‌గఢ్ రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.