పాదయాత్రలో రాహుల్​, రేవంత్​ పరుగు పోటీ విజేత ఎవరంటే

By

Published : Oct 30, 2022, 12:21 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

Bharat Jodo Yatra:తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్‌ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ కొద్దిసేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో కలిసి పరుగుపందెంలో పాల్గొన్నారు. ఈ పరుగుపందెంలో రాహుల్​ మిగతావారికంటే ఒక అడుగు ముందుకేశారు. కొద్దిసేపు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. పాదయాత్రలో భారీగా అభిమానులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో రాహుల్ వెంట మనిక్కమ్ ఠాకూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, జానారెడ్డి, మధుయాస్కీ, మల్లురవి, వంశీచంద్​రెడ్డి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.