జోడో యాత్రలో రాహుల్ జోష్ కొరడాతో కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ

By

Published : Nov 3, 2022, 5:21 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

Bharat Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. గణేశ్​ గడ్డ నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సంగారెడ్డి శివారు వరకు చేరుకుంది. ఈ క్రమంలో రాహుల్​ గాంధీకి మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఓ చోట ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజులాగా.. కొరడాతో ఆడిపాడి ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్​ నింపారు. అంతకుముందు ఆదివాసీ మహిళలతో రాహుల్​గాంధీ, రేవంత్​, సీతక్క, జగ్గారెడ్డిలు కలిసి సరదాగా కాసేపు డ్యాన్స్ చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.