లవర్​తో పెళ్లికి నో చెప్పిన పెద్దలు ట్యాంక్​ ఎక్కి మైనర్​ రచ్చరచ్చ

By

Published : Dec 18, 2022, 8:33 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

ప్రియుడితో పెళ్లికి నో అన్నారని నీటి ట్యాంక్ ఎక్కింది ఓ యువతి. వివాహానికి ఓకే చెప్పేంత వరకు కిందకు దిగనని మారం చేసింది. సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్దలను ఒప్పించి వారి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల మాటలు విన్న ఆ యువతి ఎట్టకేలకు ట్యాంక్ దిగి కిందకు వచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో జరిగింది. అయితే మూడు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్​ 8న పరారైంది. అలా ముంబయిలో తల దాచుకున్న ఆ ఇద్దరి విషయం కుటుంబసభ్యులకు తెలియగా డిసెంబర్​ 16న ప్రతాప్​గఢ్​కు వారిని తిరిగి తీసుకొచ్చారు. పెళ్లికి అబ్బాయి తరఫు వారు నిరాకరించడం వల్ల యువతి ట్యాంక్​ ఎక్కింది.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.