ETV Bharat / state

'ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారు'

author img

By

Published : May 22, 2020, 12:08 AM IST

tdp leaders protest at railway koduru
రైల్వే కోడూరులో తెదేపా నాయకుల నిరసన

పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని తెదేపా నాయకులు కడప జిల్లా రైల్వే కోడూరులో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెదేపా నాయకులు కడప జిల్లా రైల్వే కోడూరులో వినూత్నరీతిలో నిరసన చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో విసనకర్రలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి. పులివెందులలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.