ETV Bharat / state

తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

author img

By

Published : Apr 26, 2021, 8:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆనందరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం
తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట వద్ద ప్రధాన రహదారిలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మందపల్లి ఆనందరావు అనే వ్యక్తి బస్సును తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావటంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోరంగి ఎస్సై సతీష్ తెలిపారు.

ఇదీ చదవండి:

2023 మార్చి నాటికి అన్​ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్

అడవిని వీడి హోటల్​కు వచ్చిన చిరుతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.