ETV Bharat / sitara

హీరో పునీత్​ రాజ్​కుమార్​కు ప్రతిష్టాత్మక అవార్డు

author img

By

Published : Nov 4, 2021, 7:01 PM IST

ఇటీవల కార్డియాక్ అరెస్ట్​తో మరణించిన పునీత్​ రాజ్​కుమార్​ను బసవ శ్రీ అవార్డు  వరించింది. దీనిని ఆయన కుటుంబానికి అందజేయనున్నట్లు మురుగ మఠ్ స్వామిజీ తెలిపారు.

Puneeth Rajkumar
పునీత్​ రాజ్​కుమార్

కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్​ను ప్రతిష్టాత్మక బసవ శ్రీ అవార్డు-2021 వరించింది. ఈ విషయాన్ని మురుగ మఠ్ స్వామిజీ డాక్టర్. శివమూర్తి మురుగ శరన గురువారం వెల్లడించారు.

వచ్చే ఏడాది బసవ జయంతిన పునీత్​ కుటుంబానికి ఈ అవార్డు అందజేస్తామని స్వామిజీ చెప్పారు. ఈనెలలోనే ఆయన కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని అన్నారు.

కన్నడలో హీరోగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న పునీత్​ రాజ్​కుమార్.. వారి మనసుల్లో చోటు సంపాదించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు.

పునీత్.. అక్టోబరు 29న కార్డియాక్ అరెస్ట్​ వల్ల హఠాన్మరణం చెందారు. ఆ సమయంలో అభిమానులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పునీత్​తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.