ETV Bharat / international

రష్యా​ సైన్యంపై ఉక్రెయిన్​ దాడి.. 50 మంది మృతి.. భారీగా వాహనాలు ధ్వంసం

author img

By

Published : Nov 11, 2022, 8:59 AM IST

Updated : Nov 11, 2022, 9:53 AM IST

రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఉక్రెయిన్​. ఈ దాడుల్లో 50 రష్యన్ సైనికులు​ మరణించారు.

russia ukraine war
రష్యన్​ సైన్యంపై ఉక్రెయిన్​ దాడి

రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఉక్రెయిన్. ఈ దాడుల్లో 50 మంది రష్యన్ సైనికులు​ మరణించారు. భారీగా వాహనాలను ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో 3 యుద్ధ ట్యాంకులు, ఒక మాస్టా-ఎస్ యుద్ధ ట్యాంకు, 11 సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి ఉక్రెయిన్​ దళాలు. దక్షిణ ఫ్రంట్​లైన్​లో గురువారం ఈ దాడి జరిగిందని.. ఉక్రెయిన్​ దక్షిణ ఆపరేషనల్​ కమాండ్​​ తెలిపింది.

ప్రస్తుతం నల్ల సముద్రంలో రష్యా 17 నౌకలతో సిద్దంగా ఉందని చెప్పింది ఉక్రెయిన్​. అందులో 16 కాలిబర్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కలిగిన.. రెండు క్షిపణి వాహక నౌకలు ఉన్నాయని కమాండ్​​ వెల్లడించింది. ఉక్రెయిన్​లోని మానవతా చర్యలు చేపట్టే ప్రాంతాలను, భవనాలను, ఇతర సౌకర్యాలను నాశనం చేసేందుకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్​ మీడియా తెలిపింది.

Last Updated :Nov 11, 2022, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.