ETV Bharat / international

మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలుడు.. 10మంది మృతి.. 8 మందికి గాయాలు

author img

By

Published : Jan 1, 2023, 7:16 PM IST

అఫ్గానిస్థాన్​లో విషాదకర ఘటన జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

bomb blast near the main gate of Kabul Military Airport in afghanistan
మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలి పదిమంది మృతి

అఫ్గానిస్థాన్​లో దారుణం జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్​పోర్టు మెయిన్​ గేట్​కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఉత్తర తఖార్​ ప్రావిన్స్​ రాజధాని తాలూకాన్ నగరంలో బుధవారం పేలుడు జరిగి నలుగురు వ్యక్తులు గాయపడిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

తఖార్‌లోని తాలిబాన్ భద్రతా కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీ ఈ పేలుడును ధ్రువీకరించారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డెస్క్ కింద బాంబు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారని అక్కడి వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని నెలలుగా ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.