ETV Bharat / entertainment

ఒకే స్క్రీన్​పై అజిత్​-ఐశ్వర్య.. 22ఏళ్ల తర్వాత!

author img

By

Published : Jan 17, 2023, 4:41 PM IST

స్టార్​ హీరో అజిత్​ కుమార్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇటీవలే తెగింపుతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ​ మరో కొత్త ప్రాజెక్ట్​ను తెరకెక్కించే పనిలో పడిపోయారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్​తో సోషల్​ మీడియా ఒక్కసారిగా షేక్​ అయ్యింది. అదేంటంటే ఇందులో అందాల తార ఐశ్వర్యాయ్​ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ సంగతులు..

ajith and aishwarya in ak67
ajith and aishwarya in ak67

ఇటీవలే రీసెంట్​గా 'తునివు'(తెలుగులో తెగింపు) ప్రేక్షకులను పలకరించిన స్టార్​ హీరో అజిత్ కుమార్​.. ప్రస్తుతం తన అప్​కమింగ్ ప్రాజెక్ట్స్​పై పూర్తి ఫోకస్​ పెట్టారు. ప్రస్తుతం 'రాజా రాణీ' ఫేమ్​ డైరక్టర్​ విఘ్నే​శ్ శివన్​ దర్శకత్వంలో 'ఏకే 67' (వర్కింగ్​ టైటిల్) సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్​గా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్టార్​ హీరోయిన్​ త్రిష కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేందంటే పొన్నియన్​ సెల్వన్​తో సౌత్​లోకి కమ్​బ్యాక్​ ఇచ్చిన ఐశ్వర్య రాయ్​ ఈ సినిమాలో అజిత్​ సరసన కనిపించనున్నట్లు టాక్​. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఒకవేళ ఇదే కనుక ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

గతంలో 22 ఏళ్ల క్రితం వీరిద్దరు 'ప్రియురాలు పిలిచింది' అనే సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే సినిమలో వీరిద్దరు కనిపించలేదు. దీంతో మళ్లీ వీళ్లు ఒకే స్క్రీన్​పై కనిపిస్తే బాగుండు అని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యాతో పాటు అరవింద స్వామి, అర్జున్​ దాస్​ లాంటీ కీలక వ్యక్తులు నటించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాకు గట్టి బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ ఇచ్చేందుకు యంగ్​ డైరక్టర్​ అనిరుధ్​ పనిచేయనున్నట్లు టాక్​.

ajith and aishwarya in priyuralu pilichindi movie
ప్రియూరాలు పిలిచింది సినిమాలో అజిత్​ ఐశ్వర్యా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.