ETV Bharat / city

గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారు: రామకృష్ణ

author img

By

Published : Jun 8, 2021, 9:57 PM IST

Updated : Jun 9, 2021, 2:00 AM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మరో 16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.బీవోటీ ఒప్పందం ప్రకారం గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందేలా చూడాలని ఆయన కోరారు.

16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును అదాని కంపెనీకి ఎలా కట్టబెడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. గంగవరం పోర్టు వాటాల అమ్మకం వెనుక లాలూచీ ఏంటని ప్రశ్నించారు. 30 ఏళ్ల తర్వాత పోర్టు ప్రభుత్వానికే చెందాలని బీఓటీ ఒప్పందంలో ఉన్నా...దాన్ని ఎలా ఉల్లంఘిస్తారని నిలదీశారు. కార్పొరేట్‌ కబంధహస్తాల నుంచి పోర్టును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఇదీ చదవండీ... 'ప్రజల్ని విభజించి పాలిస్తున్న జగన్​రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారు'

Last Updated :Jun 9, 2021, 2:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.