ETV Bharat / bharat

ల్యాండింగ్​కు నో చెప్పిన ఆఫీసర్స్​.. అరగంట పాటు గాల్లోనే తిరిగిన విమానం.. చివరకు..

author img

By

Published : Dec 30, 2022, 10:26 AM IST

Updated : Dec 30, 2022, 3:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని ఓ విమానం 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ముంబయి నుంచి వచ్చిన విమానాన్ని ప్రతికూల వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన ల్యాండింగ్​కు అనుమతించలేదు అధికారులు.

picejet aircraft hovered in air for 30 minutes in Varanasi
30 నిమిషాల పాటు గాలిలో సంచరించిన విమానం

స్పైస్​జెట్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అధికారులు ల్యాండ్​ అవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం రాత్రి జరిగింది.

30 నిమిషాల పాటు గాల్లోనే
స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఎస్​జీ 201 విమానం ముంబయి విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి 9.45 గంటలకు బయలుదేరి.. వారణాసిలోని విమానాశ్రయానికి చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ చేయడానికి అనుకూల వాతావరణం లేదు. దీంతో అధికారులు విమానం ల్యాండ్ చేయడానికి అనుమతినివ్వలేదు. దీని వల్ల ఆ విమానం దాదాపు 30నిమిషాల పాటు గాలిలోనే తిరుగుతూ ఉంది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. చేసేదేమీ లేక 10:15 గంటలకు విమానాన్ని తిరిగి ముంబయికి మళ్లించారు. విమానంలో 108 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ల్యాండింగ్​కు అనుమతినివ్వలేదని చెప్పారు.

Last Updated :Dec 30, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.