హైదరాబాద్​ను విజయవాడగా చూపించి మోసం చేయాలనుకుంటున్నారు- పట్టాభి - TDP Leader Pattabhiram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:32 PM IST

thumbnail

TDP Leader Pattabhiram Explain YSRCP fake Video : విజయవాడ తూర్పు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ ఫేక్ వీడియో విడుదల చేసిందంటూ తెలుగుదేశం పార్టీ  తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వాస్తవాలను బహిర్గతం చేశారు. హైదరాబాద్​లో చిత్రీకరించిన దృశ్యాలను విజయవాడగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్​లో చిత్రీకరించి విజయవాడ అభివృద్ధిగా చూపించారంటూ వాస్తవాలను ఆధారాలతో పట్టాభి రామ్ బయటపెట్టారు. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధిపై తెలుగుదేశం వీడియో విడుదల చేసింది. హైదరాబాద్​లో వీడియో తీసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తీసినట్లు చెప్పుకునే స్థాయికి వైఎస్సార్సీపీ నేతలు దిగజారి పోయారని పట్టాభి రామ్ మండిపడ్డారు. అవినాష్ అఫిడవిట్​లో దాఖలు చేసిన ఆస్తుల వివరాల కూడా ఫేక్​ అని పట్టాభిరామ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గెలిపించుకుని ఐదు ఏళ్లుగా నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ప్రారంభిస్తామని, ఐదు ఏళ్లుగా జరుగుతున్న దాడులని ఆపుతామని పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.