బిర్యానీ తింటుండగా ఉంగరం - అవాక్కైన కస్టమర్లు - Ring in Biryani At Peddapalli

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 4:11 PM IST

thumbnail

Ring in Biryani At Peddapalli District : బిర్యానీ తింటుండగా ఉంగరం ప్రత్యక్షమైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్​ పరిధిలోని కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్​ ఉంది. బుధవారం రాత్రి కొంతమంది యువకులు భోజనం చేయడానికి అక్కడకు వచ్చారు. కొద్దిగా మద్యం, రెండు బిర్యానీలను వారు ఆర్డర్​ చేశారు. రెస్టారెంట్​లోని సప్లయర్ యువకులకు బిర్యానీ వడ్డించాడు. వారు తింటుండగా ఒకరి చేతికి గట్టిగా ఏదో తగిలింది. ఏంటా అని పరిశీలించి చూస్తే అది ఉంగరం. 

బిర్యానీలో ఉంగరం కనిపిచడంతో యువకులు ఆశ్చర్యపోయారు. వెంటనే రిస్టారెంట్​ సిబ్బందిని నిలదీయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.  బిర్యానీలో ఎలా ఉంగరం వస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు కానీ జవాబు చెప్పలేదు.  సుమారు గంటసేపు వేచిచూసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కౌంటర్​ వద్దకు వచ్చి ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో  చేసేదేమి లేక ఆ యువకులు వెనుతిరిగి పోయారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.