ఆశా వర్కర్లపై పోలీసుల దౌర్జన్యం - రోడ్లపై ఈడ్చుకుంటూ అరెస్టులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 1:19 PM IST

thumbnail

Police Arrested Asha Workers: డిమాండ్ల సాధన కోసం ఆశావర్కర్లు రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ ఆశా కార్యకర్తలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడకు వెళ్లకుండా ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడకు వెళ్లేందుకు యత్నిస్తుండగా ఆశావర్కర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి జాతీయ రహదారిపై ఆశా కార్యకర్తులు బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే అడ్డగింతలేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆశావర్కర్లు బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసేయడంతో నిరసనకారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులను తోసుకుంటూ గేట్లు దూకి తప్పించుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడకు బయలుదేరారు. 

ఆశా కార్యకర్తలు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలంటూ తాడేపల్లి జాతీయ రహదారిపై ఆశావర్కర్లు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆశా కార్యకర్త లక్ష్మిస్పృహతప్పి పడిపోయారు. ఐదేళ్లు దాటినా ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చకుంటే జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇస్తామని తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.