ETV Bharat / state

మాచర్లలో రాళ్లు, బీరు సీసాల వాహనం కలకలం - స్వాధీనం చేసుకున్న పోలీసులు - YCP Stone Vehicle in Macharla

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 3:32 PM IST

Police Hand Over the YCP Leaders Stone Vehicle in Macharla: పోలింగ్​ ముగిసినా కూడా పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి సమీపంలో ట్రాలీ ఆటోలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలు నిండిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడినట్లు తెలిసింది.

Police Hand Over the YCP Leaders Stone Vehicle
Police Hand Over the YCP Leaders Stone Vehicle (ETV Bharat)

Police Hand Over the YCP Leaders Stone Vehicle in Macharla: పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్‌ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. మాచర్లలో రాళ్లతో ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి సమీపంలో ట్రాలీ ఆటోలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలు నిండిన వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇదే వాహనాన్ని కారంపూడి ఇంటికి పిన్నెల్లి తన కాన్వాయ్ వెంట తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడినట్లు తెలిసింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజల్లో ఇప్పటికి భయాందోళనలు తొలగలేదు.

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో బాంబుల కలకలం - తనిఖీల్లో గుర్తించిన పోలీసులు - bombs in ysrcp leaders houses

మరోవైపు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించడంతో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్‌ కారణంగా షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే దాడులకు వెళుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం సమస్యాత్మక ప్రాంతాల్లో మాచర్ల, నరసరావుపేట, పెదకూరపాడులో 144 సెక్షన్‌ అమలుచేస్తూ నేతలను గృహనిర్బంధం చేశారు. స్వయంగా ఐజీ, ఎస్పీ మాచర్ల కేంద్రంగా ఉంటూ భద్రతను పర్యవేక్షించారు. ఇంటిదొంగలను గుర్తించి వారిపై నిఘా ఉంచడటంతో పోలీసుశాఖలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్​శాఖ విచారణ - POLICE HELP IN PALNADU VIOLENCE

పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేశారని గుర్తించిన ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వందల మందితో కారంపూడిపై పట్టపగలే దండయాత్ర చేయడాన్ని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామంపై వందల మందితో దండయాత్రకు వెళ్లి గ్రామంలో కర్రలు, రాడ్లతో ఈలలు వేస్తూ టీడీపీ వారిని కించపరుస్తూ దాడులకు యత్నించారు. పోలింగ్‌ రోజు ముందస్తు సమాచారంతో బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం తర్వాత ఘటనలను కూడా అడ్డుకోలేకపోతోంది.

పోలీసు యూనిట్ల అడ్డగోలు విభజన - విడదీసిన స్టేషన్ల పరిధిలో హింసాత్మక ఘటనలు - YSRCP Attacks in gannavaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.