'ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి 20 వేల డాలర్లు'- గుర్రపు బగ్గీపై వచ్చి వినూత్నంగా నామినేషన్ - Jabalpur Candidate Nomination

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:35 AM IST

thumbnail

Jabalpur Candidate Unique Nomination : లోక్​సభ ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి 20,000 డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఓ స్వతంత్ర అభ్యర్థి భర్త. అంతే కాకుండా నామినేషన్ దాఖలు చేసేందుకు గుర్రపు బగ్గీ కలెక్టరేట్​కు వచ్చారు. వాళ్లే మధ్యప్రదేశ్​కు చెందిన స్టాన్లీ లూయిస్ జంట.  

జబల్​పుర్​ జిల్లాకు చెందిన స్టానీ లూయిస్ భార్య శశి స్టెల్లా లూయిస్ స్వతంత్ర అభ్యర్థిగా ఈ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్​కు దంపతులిద్దరూ గుర్రపు బగ్గీపై వచ్చారు. శశి స్టెల్లా తరపున స్టాన్లీ లూయిస్ నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య శశి ఎన్నికల్లో గెలిస్తే జబల్​పుర్​లోని ప్రతి వ్యక్తికి 20,000 డాలర్లు ఇస్తామని స్టాన్లీ హామీ ఇచ్చారు. అయితే ఈ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని అని అడగ్గా, అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశానని సమాధానం ఇచ్చారు. 

కోహినూర్​ మాదే అంటూ నోటీసులు
గతంలో స్టాన్లీ రాష్ట్రపతి ఎన్నికలకు కూడా నామినేషన్​ పత్రాన్ని పూరించారు. అప్పుడు దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక హెలికాప్టర్ ఇస్తామని ప్రకటించారు. ఇదే కాదు కోహినూర్​ వజ్రం తమ వారసులదేనంటూ లండన్​కు నోటీసులు పంపారు. అలాగే స్విస్​ బ్యాంకులో డిపాజిట్​ అయిన నల్లధనంపై స్విట్జర్లాండ్​ గవర్నర్​కు లేఖ రాశారు. కానీ స్టాన్లీ లూయిస్ తన కుటుంబాన్ని పోషించేందుకు జబలపుర్ రైల్వే స్టేషన్​ సమీపంలో ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.