ఫీజు పెంపు - ఇడుపులపాయ ట్రిపుల్ ​ఐటీ విద్యార్థుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 8:52 PM IST

thumbnail

Idupulapaya IIIT Students Protest: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ​ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజులు చెల్లించే విషయంపై ఈ-3, ఈ-4 విద్యార్థులు ధర్నాకు దిగారు.  ఫీజుల పెంపుపై క్యాంపస్ అకాడమిక్ బ్లాక్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. గతంలో మాదిరిగానే ఫీజులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. 

రీయింబర్స్​మెంట్  వస్తుంది: విద్యార్థుల ధర్నాపై  ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడారు. 2020 కన్నా ముందు జాయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్​షిప్​ ఎక్కువ ఇస్తుందని తెలిపారు. దీంతో స్కాలర్​షిప్​ అందే విద్యార్థులకూ నాన్ స్కాలర్​షిప్​ వారికి తేడా కనిపిస్తుందన్నారు. ఫీజు పెంపు అంశాన్ని వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని కుమారస్వామి వెల్లడించారు.  గతంలో జాయిన్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 40 వేల ఫీజు ఉండేదని అన్నారు. ప్రస్తుత గవర్నమెంటు రూ. 50 వేల ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇస్తుందని తెలిపారు. అందుకే  ఫీజును రూ. 50 వేలకు పెంచినట్లు తెలిపారు. నాన్ స్కాలర్​షిప్​ విద్యార్థులకు రూ 40 వేల ఫీజును మాత్రమే వసూలు చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.