ఆదోని పోలీస్​స్టేషన్​లో ఇంటి దొంగ- ​రూ.5 లక్షలు కాజేసిన హోంగార్డు - home guard stole the money

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 4:44 PM IST

thumbnail

Home Guard stole the Money From Police Station in Kurnool District : ఎవరైన దొంగతనం చేస్తే పట్టుకొని బుద్ధి చెప్పాల్సిన పోలీసే బుద్ధిలేని పనిచేశాడు. స్టేషన్​లో భద్రపరిచిన సోమ్మునే కాజేసి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మనోజ్ అనే వ్యక్తి ఆదోని రెండో పట్టణ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా అక్కడి పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. మనోజ్​పై నమ్మకంతో  బీరువా తాళాలు అతడి చేతికిచ్చి ఫైళ్లు తీసుకురమ్మని చెప్పేవారు అధిాకారులు. అయితే ఆ బీరువాలో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును పోలీసు భద్రపరిచారు. ఆ డబ్బుపై మనోజ్​కు కన్నుపడింది. 

ఈ క్రమంలో ఎవ్వరు లేని సమయంలో బీరువాలో ఉన్న సూమారు రూ. 5లక్షల 63వేల నగదును కాజేశాడు. బీరువాలో డబ్బు లేదన్న విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆ డబ్బును ఇంటి దొంగ మనోజ్ కాజేశాడని నిర్ధరించుకున్నారు.​ నిందితుడిని అదుపులో తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. హోంగార్డు మనోజ్ నుంచి రూ.3 లక్షల నగదు రికవరీ చేశామని, మిగతా డబ్బును కూడా రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే మనోజ్​ను రిమాండ్​కు తరలించామని రెండో పట్టణ పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.