పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు- ఐరన్ లోడ్​తో వెళ్తుండగా 10 బోగీలు బోల్తా

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 4:26 PM IST

thumbnail

Goods Train Derails In Delhi : దిల్లీలోని సరాయ్​ రోహిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. దీంతో 10 బోగీలు బోల్తా పడ్డాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో గూడ్స్​ రైలు ఐరన్​ షీట్​ రోల్స్​తో వెళ్తున్నట్లుగా వారు వెల్లడించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
దిల్లీలో శనివారం ఉదయం ఓ గూడ్స్​ రైలు ప్రమాదానికి గరైంది. జాఖీరా ఫ్లై ఓవర్​ దాటుతుండగా రొహల్లా రైల్వే స్టేషన్​కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న అధికారులు హూటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రైల్లో ఐరన్ షీట్​ రోల్స్​ ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.