బైక్ అడ్డంగా పెట్టావంటూ దళిత యువకుడిపై వైసీపీ వర్గీయులు దాడి - YCP Leaders Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 10:47 AM IST

thumbnail

Dalit Youth Attacked by YCP Leaders in Nadyala District : శ్రీశైలంలో ఓ దళిత యువకుడిపై ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఈ సంఘటనపై బాధితుడు శీలం ప్రసన్నకుమార్​ బుధవారం శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలానికి చెందిన శీలం ప్రసన్నకుమార్​ మంగళవారం రాత్రి ఒక దుకాణం వద్ద టిఫిన్​ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ద్వి చక్ర వాహనం అడ్డుగా ఉందని సుబ్బయ్య అనే యువకుడు ప్రసన్నకుమార్​తో గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని సుబ్బయ్య వైసీపీ మద్ధతుదారుడైన చంద్రశేఖర్​ అనే యువకుడికి తెలియజేశాడు. దీంతో చంద్రశేఖర్​ బాధితుడిని వాసవీ సత్రం సమీపంలోకి పిలిపించాడు. చంద్రశేఖర్​ పాటు మరో అయిదుగురితో కలిసి ప్రసన్న కుమార్​పై తీవ్రస్థాయిలో దాడి చేశారు. దాడికి పాల్పడిన ఆరుగురుపై బైండోవర్​ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.