LIVE : గజ్వేల్​లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 7:03 PM IST

Updated : Feb 25, 2024, 7:49 PM IST

thumbnail

BJP Vijaya Sankalp Yatra Gajwel : పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. గజ్వేల్​లో జరుగుతున్న యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అంతకు ముందు భద్రాచలంలో జరిగిన యాత్రలో ఛత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా భద్రాద్రి రామాలయం బీజేపీ సమావేశ ప్రాంగణం వద్ద పోలీసులు, భద్రతా బలగాలు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఈ యాత్రలో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో సుమారు 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించే విధంగా యాత్రను ప్లాన్​ చేశారు. గతంలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

Last Updated : Feb 25, 2024, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.