పాఠశాల వాటర్ ట్యాంక్​లో కుళ్లిన జంతు కళేబరం - తల్లిదండ్రుల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 5:50 PM IST

thumbnail

Animal Carcass in Water Tank Eluru District : అదొక ప్రభుత్వ పాఠశాల. అందులో 550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో ఒక వాటర్​ ట్యాంక్​. భోజనం చేసే సమయంలో విద్యార్థులు అక్కడే ముఖం, చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటారు. ఆ వాటర్​ ట్యాంక్​ను ఆదివారం శుభ్రం చేస్తుడంగా కుళ్లిన జంతు కళేబరం కనిపించింది. ఈ సంఘటన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రభుత్వ హైస్కూల్లో వెలుగు చూసింది. వాటర్​ ట్యాంక్​ శుభ్రం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Negligence of Authorities : పోలవరం ప్రభుత్వ పాఠశాలోని వాటర్​ ట్యాంక్​లో కుళ్లిన జంతు కళేబరం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాఠశాలోని వాటర్​ ట్యాంక్​ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఈ సంఘటన  విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.