ETV Bharat / state

ఆగ'మేఘా'లపై అస్మదీయులకు మరో ప్రాజెక్టు- ఎన్నికల ప్రకటనకు ముందే జగన్​ మాయ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:21 AM IST

Updated : Mar 13, 2024, 7:42 AM IST

YCP Government Has Entrusted New Project
YCP Government Has Entrusted New Project

YCP Government Has Entrusted New Project to Megha Engineering: జగన్‌ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. జగన్​ ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల ప్రకటన వచ్చే ముందు హడావుడిగా ఎల్​వోఏను ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

YCP Government Has Entrusted New Project to Megha Engineering: జగన్‌ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్‌కు ముందు ఆగమేఘాలపై 12,264.36 కోట్ల రూపాయలతో చేపట్టే కొత్త ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడే ముందు హడావుడిగా ఎల్​వోఏ (Letter Of Award)ను ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్న పరిశ్రమలపై జగన్నాటకం- ఎన్నికల వేల మళ్లీ సర్వేపేరుతో బకాయిలకు మంగళం

అల్లూరి జిల్లాలోని ఎగువ సీలేరు పీఎస్‌పీ ఏర్పాటు కోసం రూ.6,717 కోట్ల విలువైన పనులకు గుత్తేదారుల ఎంపిక కోసం ఏపీజెన్‌కో(Andhra Pradesh Power Generation Corporation Limited) గత ఏడాది జూన్‌ 28న టెండర్లకు పిలిచింది. మేఘా, నవయుగ, రిత్విక్‌ జేవీ, జీపీవీఎల్​ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ సంస్థలు బిడ్‌లు వేశాయి. ప్రైస్‌ బిడ్‌లను 2023 నవంబరు 16న అధికారులు తెరిచారు. ఎల్‌1గా నిలిచిన మేఘా సంస్థ రూ.7,380 కోట్లకు బిడ్‌ను స్వాధీనం చేసుకుంది. టెండరు విలువపై 9.87శాతం అధిక మొత్తానికి ప్రభుత్వం మేఘా సంస్థకు పనులను కట్టబెట్టింది. ఈ నిర్ణయంతో గుత్తేదారు సంస్థకు 663 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది.

​పాలన ముగింపు దశలో ప్రాజెక్టులపై ప్రేమ ఒలకబోస్తున్న సీఎం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరు దగ్గర పీఎస్‌పీ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల ద్వారా 1350 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కోసం ఈపీసీ విధానంలో పనులను చేపట్టేలా గుత్తేదారుల ఎంపిక కోసం టెండర్లను పిలిచింది. పనులన్నింటితో పాటు నిర్మాణ సమయంలో వడ్డీ, ఎస్కలేషన్‌, 18 శాతం జీఎస్‌టీతో కలిపి 12,264.36 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అంచనాలను ఆమోదించింది. ప్రాజెక్టు నిర్మాణానికి 9,485.99 కోట్ల రూపాయలతో డీపీఆర్‌ను వ్యాప్కోస్‌ సంస్థ 2022 నవంబరులో రూపొందించింది. ప్రభుత్వం ఆమోదించిన రివైజ్డ్‌ అంచనాల ప్రకారం ఐడీసీ, ప్రైస్‌ ఎస్కలేషన్‌ కింద 2,778.57 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అనుమతించింది. అంటే డీపీఆర్‌లో ప్రతిపాదించిన ప్రాజెక్టు వ్యయంలో ఐడీసీ, ఎస్కలేషన్‌ పేరుతో 29.29 శాతం భారం పడుతుంది. ఈ ప్లాంటు రోజుకు 8.10 గంటలు ఉత్పత్తిలో ఉండటం ద్వారా ఏటా 3,502 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని వ్యాప్కోస్‌ సంస్థ అంచనా వేసింది.

ఆగ'మేఘా'లపై అస్మదీయులకు మరో ప్రాజెక్టు- ఎన్నికల ప్రకటనకు ముందే జగన్​ మాయ

ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో రైతులు సంతోషిస్తారా జగన్​ ?: టీడీపీ

పీఎస్‌పీ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనడానికి తొలుత హడావుడి చేసిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ ఆఖరు నిమిషంలో ప్రతిపాదన విరమించుకుంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించి బిడ్‌ వేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఏడాది వ్యవధిలో ఏ ఒక్క పీఎస్‌పీకీ కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. కానీ ఈ ప్రాజెక్టు అనుమతుల విషయంలో షిర్డీసాయి సంస్థ ప్రయత్నాలు చేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

గత ఏడాది నవంబరులో టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత గుత్తేదారు సంస్థకు 3నెలల వ్యవధిలోనే ఎల్‌వోఏ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు రివైజ్డ్‌ అంచనాలను ఆమోదిస్తూ గత నెల ఫిబ్రవరి 23న ఉత్తర్వులు ఇచ్చి ఆ తర్వాత 10 రోజుల్లో గుత్తేదారు సంస్థకు ఎల్‌వోఏ ఇచ్చాయి. ఇతర ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో ఇంత వేగంగా ప్రభుత్వం స్పందించలేదని విద్యుత్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అసంపూర్తి పనులు, అరకొర నిర్మాణం, పూర్తి కాని వంశధారపై హైలెవెల్ వంతెన

Last Updated :Mar 13, 2024, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.