ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 7:04 PM IST

AP Politics 2024
Janasena Chief Pawan Kalyan Speech in AP

Pawan Kalyan Speech in Praja Galam Meeting : ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు.

Pawan Kalyan Speech in Praja Galam Meeting : ఆంధ్రప్రదేశ్​లో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ప్రధాని నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చిందని అన్నారు.

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే - ఎన్డీఏ ప్రభుత్వం రావాలి : ప్రధాని మోదీ

ఎన్డీయే పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం తెలుపుతున్నామని పేర్కొన్నారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి (Tirupati Venkateswara Swamy) సాక్షిగా ప్రారంభమైన పొత్తు, ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ అన్నారు.

ధర్మానిదే విజయం-పొత్తుదే గెలుపు- కూటమిదే పీఠం : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఒక సారా వ్యాపారిగా మారారని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా డిజిటల్‌ ట్రాన్సక్షన్‌ చేస్తుంటే, ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, పారిశ్రామిక ప్రగతి (Industrial Progress) 2019లో 10.24 శాతం ఉండగా, ప్రస్తుతం 3 శాతానికి దిగజారిపోయిందని ఆరోపించారు.

TDP Janasena Bjp Meeting : అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసుడిని తీసేయటం కష్టం కాదని అన్నారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్‌ రెడ్డి విర్రవీగుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ, ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని తెలిపారు. రామరాజ్యం స్థాపన జరగబోతోందని, ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం అని ఆయన స్పష్టం చేశారు.

‘‘అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు, ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది.’’ - పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్‌

చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి ముగ్గురు అగ్రనేతలు

ఏపీలోని పిఠాపురం నుంచి బరిలో దిగనున్న జనసేనాని పవన్​ కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.