ETV Bharat / state

అధికార లాంఛనాలతో రాజీవ్​ రతన్​ అంత్యక్రియలు - సీఎం రేవంత్ రెడ్డి నివాళి - RAJIV RATAN Final rites

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 2:15 PM IST

Updated : Apr 10, 2024, 5:27 PM IST

IPS Officer rajiv ratan Funeral : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ డీజీ రాజీవ్ ​రతన్​ అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై నివాళులు అర్పించారు.

IPS Officer rajiv ratan Funeral
IPS Officer rajiv ratan Funeral

అధికార లాంఛనాలతో రాజీవ్​ రతన్​ అంత్యక్రియలు - సీఎం రేవంత్ రెడ్డి నివాళి

IPS Officer Rajiv Ratan Funeral : హైదరాబాద్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్​రతన్​ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఐఏఎస్, ఐపీఎస్​లతో పాటు పలువురు సైనిక అధికారులు హాజరై నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం(Rajiv Funeral With State Honor) అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.

IPS Officer Rajiv Ratan Death : మంగళవారం ఉదయం కుమారుడితో కలిసి రాజీవ్​రతన్​ జాగింగ్​కు వెళ్లారు. కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురై విపరీతమైన​ గుండెనొప్పితో బాధపడగా ఆయన కుమారుడు సీపీఆర్​ చేశారు. అయినప్పటికీ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సమర్థ అధికారిగా గుర్తింపు
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్​రతన్​ సమర్థ అధికారిగా పేరొందారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై(Medigadda Project) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్​గా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర పోలీస్‌శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజీవ్‌ రతన్‌కు పోలీస్‌శాఖలో ముక్కుసూటి అధికారిగా పేరుంది. సుదీర్ఘ కాలం పోలీసు విభాగానికి ఆయన విశిష్ఠ సేవలు అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

గవర్నర్​ సంతాపం : సీనియర్​ ఐపీఎస్​ అధికారి రాజీవ్​రతన్​ మృతికి రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్​ రాధాకృష్ణన్​ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సీఎం రేవంత్​ తీవ్ర దిగ్భ్రాంతి : సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థంగా, నిజాయతీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదని రేవంత్​ రెడ్డి అన్నారు. రాజీవ్​ రతన్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గుండెపోటుతో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ మృతి - సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి - Vigilance DG Rajeev Ratan Die

Last Updated : Apr 10, 2024, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.