ETV Bharat / state

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 7:00 PM IST

Updated : Feb 7, 2024, 8:14 PM IST

HMDA Shiva Balakrishna Case Update : హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివబాలకృష్ణకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అందులో బినామీల పేరిట 214 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. శివబాలకృష్ణ ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను కోర్టులో హజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Shiva Balakrishna Case Update
Shiva Balakrishna Case Latest Update

HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ(ACB) అధికారులు గుర్తించారు. ఆయన ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీ నేటితో పూర్తి కావడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శివబాలకృష్ణను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన జ్యుడీషియల్​ రిమాండ్​(Judicial Remand) రేపటితో ముగియనుంది. అలాగే ఈ కేసులో కీలక విషయాలను గుర్తించినట్లు ఏసీబీ జాయింట్​ డైరెక్టర్​ సుదీంద్ర తెలిపారు.

ఈ కేసులో బాలకృష్ణ, ఆయన బినామీల పేరు మీద 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ జాయింట్​ డైరెక్టర్ సుదీంద్ర తెలిపారు. ​అత్యధికంగా జనగామలో 102 ఎకరాల భూమి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆయన పేరు మీద 29 ప్లాట్లు ఉండగా అందులో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు బయటపడిందన్నారు. ఒక విల్లాతో పాటు 7 ఇళ్లు ఉండగా బహిరంగ మార్కెట్​లో ఆ ఆస్తుల విలువ రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు.

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా

Ex HMDA Director Shiva Balakrishna Case : హెచ్​ఎండీఏ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ జాయింట్​ డైరెక్టర్​ సుదీంద్ర వివరించారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పలేదన్నారు. మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకోవాలా లేదా అని న్యాయ సలహాతో ముందుకు వెళ్తామన్నారు.

ఈ కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్​ కుమార్​ను కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయనకు మరో ముగ్గురు బినామీలను గుర్తించామని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు. శివబాలకృష్ణకు సంబంధించి ఒక బ్యాంకు లాకర్​ తెరిచినట్లు, అందులో పాస్​ పుస్తకంతో పాటు 18 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తేలిందని సుదీంద్ర తెలిపారు.

"శివబాలకృష్ణకు రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించాం. ఆయనకు ప్రధానంగా ముగ్గురు బినామీలు ఉన్నారు. శివబాలకృష్ణ కుటుంబం పేరిట 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించాం. బాలకృష్ణ, ఆయన బినామీల పేరు మీద 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అత్యధికంగా జనగామలో 102 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నాయి. అలాగే ఈ హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ సోదరుడు శివ నవీన్​ను కూడా కస్టడీకి తీసుకుంటామని" అని ఏసీబీ జాయింట్​ డైరెక్టర్​ సుదీంద్ర వెల్లడించారు.

శివబాలకృష్ణపై కొనసాగిన ఏసీబీ విచారణ - సోదరుడు శివ నవీన్ కుమార్‌ అరెస్ట్​

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

Last Updated : Feb 7, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.