ETV Bharat / state

చదువులమ్మ ఒడిలో సమస్యల వ్యథ - విద్యార్థులను వెంటాడుతున్న వసతుల లేమి!

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 2:31 PM IST

Gurukulam Students Facing Problems in Enkoor
Gurukulam Students Facing Problems in Enkoor

Gurukulam Students Facing Problems in Enkoor : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల్లో తొలి పది ర్యాంకుల్లో రెండుకు పైగా ర్యాంకులు సాధిస్తూ గుర్తింపు పొందింది ఆ గురుకులం. నిరుపేద విద్యార్థుల పాలిట వరంగా ఉన్న ఆ విద్యాలయం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. 1983 నుంచి నేటి వరకు వేలాది మంది పేదవిద్యార్థులకు చదువులమ్మ ఒడిగా భాసిల్లుతూ విద్యార్థుల్ని ఉన్నతస్థాయికి చేర్చిన ఖమ్మం జిల్లా ఏన్కూరులోని గురుకుల విద్యాలయంలో ఇప్పుడు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు విద్యార్థులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఏ సంక్షేమశాఖ లేని ఈ జనరల్‌ గురుకులాన్ని నిధుల కేటాయింపుల్లోనూ తీవ్రనిర్లక్ష్యం వెంటాడుతుండడంతో విద్యార్థులు దినదినగండంగా చదువులు సాగించాల్సి వస్తోంది.

Gurukulam Students Facing Problems

Gurukulam Students Facing Problems in Enkoor : పేద విద్యార్థులకు చక్కటి విద్యాబుద్దులు నేర్పాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు రెండు గురుకులాలు అప్పట్లో ప్రారంభించారు. ఒకటి బాలురు, మరొకటి బాలికలకు ఏర్పాటు చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాలురకు ఏన్కూరు, బాలికలకు వైరాలో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బూర్గంపహాడ్‌లో బాలికలకు మరో పాఠశాల మంజూరు చేశారు. ఇవన్నీ జనరల్‌ కేటగిరి గురుకులాలుగా ఉన్నాయి.

Enkoor Gurukul students Problems : కొన్నాళ్ల తర్వాత సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, పదేళ్ల క్రితం వెనకబడిన తరగతుల శాఖలు గురుకులాలకు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటగా ప్రారంభమైన ఏన్కూరు, వైరా గురుకులాలు(Gurukuls) మాత్రం ఎలాంటి సంక్షేమశాఖ పరిధిలో లేవు. విద్యాశాఖలో మిగులు నిధులతో వీటిని నిర్వహించాల్సి వస్తోంది. విద్యాశాఖలో నిధులు తక్కువగా ఉండటంతో ఈ పాఠశాలలకు సదుపాయాలు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులైన రాజీవ్‌ విద్యామిషన్‌, సర్వశిక్షా అభియాన్‌ పథకాలతో(Sarva s పాఠశాల తరగతి గదులు నిర్మాణం చేయడం మినహా ఎలాంటి అభివృద్ది చేపట్టడం లేదు.

నిజాం హాస్టల్​లో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల ఆందోళన

Gurukulam Students Facing Problems : ఈ గురుకులంలో వేలాది మంది విద్యార్థులు చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచారు. ప్రతి ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలతోపాటు తొలి పది ర్యాంకుల్లో స్థానం దక్కించుకుంటారు. అలాంటి ఈ గురుకులంలో విద్యార్థులు నిత్యం అనేక కష్టాలు ఎదుర్కుంటున్నారు. తొలినాళ్లలో 250 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహంలో ప్రస్తుతం 650 మంది బస చేయాల్సి వస్తోందంటే సమస్య ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది.

Inadequate Facilities In Gurukulam : రాజీవ్‌ విద్యామిషన్‌(Rajiv Vidya Mission) సహకారంతో పాఠశాల భవనాలు సమకూరినా గురుకుల విద్యాలయ సంస్థ ద్వారా వసతుల కల్పనకు ఎలాంటి సహకారం అందడం లేదు. వసతి గృహం సరిపడా లేకపోవడంతో 6,7 తరగతుల విద్యార్థులు తరగతి గదుల్లోనే సర్దుకుంటున్నారు. పగలు తరగతి గదిగా, రాత్రి వసతిగృహంగా వాడుతున్నామని... పుస్తకాల సంచులు, పెట్టెల మధ్య కష్టంగా ఉందంటుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"మా క్లాస్​ రూంలో ఒకటే ఫ్యాన్ ఉంది. భోజనశాల ఇరుకుగా ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది విద్యార్థులం బయటే భోజనం చేయాల్సి వస్తోంది. లైట్లు, ఫ్యాన్లు సరిపడినంతగా లేవు. పెట్టెలు, లగేజీలు అన్నీ ఒకే చోట ఉంచాల్సి రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది" - వసతి గృహ విద్యార్థి

సమస్యల పుట్ట.. అసౌకర్యాల అడ్డాగా వెల్దండ బీసీ వసతిగృహం

వసతుల లేమితో విద్యార్థులకు తప్పని తిప్పలు
తొలుత ఎన్​.ఎస్.పి క్వార్టర్స్‌లలో వసతి గృహం ప్రారంభం కాగా 25 ఏళ్ల క్రితం 150 మందికి సరిపోయే డార్మెటరీ, భోజనశాల నిర్మించారు. ఏటా పాఠశాలను(School) అప్‌గ్రేడ్‌ చేస్తూ 450మందికి చేర్చినా వసతులు మాత్రం పెంచలేదు. అసలే చాలీచాలని భవనాలతో ఉన్న ఇక్కడ ఐదేళ్ల క్రితం జూనియర్‌ కళాశాల కూడా ప్రారంభించారు. దీంతో మరో 160 మంది ఎక్కువయ్యారు. ఇలా విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం వసతి భవనాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డార్మెటరీలో ఉన్న విద్యార్థులు.. ఆ భవనం శిథిలావస్థకు చేరి పై పెచ్చులు రాలుతున్నాయని, భయంగా ఉండాల్సి వస్తుందంటున్నారు. పేద విద్యార్థుల పాలిట ఆలయంగా ప్రఖ్యాతి గాంచిన ఈ విద్యాలయంలో వసతుల కల్పనపై ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏన్కూరు, వైరాలో బాలబాలికలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుందని... ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

పీజీ కాలేజ్‌ ఉమెన్స్​ హాస్టల్ స్నానాలగదిలో ఆగంతకులు - రక్షణ కోసం విద్యార్థినుల ధర్నా

హాస్టల్​ ఫుడ్​లో పురుగులు, ఆందోళనకు దిగిన జేఎన్టీయూ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.