ETV Bharat / state

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ నిషేధం- 48గంటల పాటు నో పర్మిషన్​ - EC Bans KCR From Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 7:46 PM IST

ec_bans_kcr
ec_bans_kcr

EC Bans Former CM KCR From Election Campaign : బీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​పై ఈసీ చర్యలుతీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్​ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ చర్యలకు పూనుకుంది.

EC Bans Former CM KCR From Election Campaign : బీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్​ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్​పై ఈసీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్​ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్​పై చర్యలకు ఈసీ పూనుకుంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్​ 5న సిరిసిల్లలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్​ ఫిర్యాదు చేశారు.

వివేకా హంతకులకు సీఎం జగన్ అండ- పులివెందుల ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి : షర్మిల - YS Sharmila allegations

ఈసీకి కేసీఆర్​ ఇచ్చిన వివరణ : ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ కేసీఆర్​ సమాధానం కోరింది. దీనికి గులాబీ బాస్ వివరణ ఇచ్చారు. తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. కాంగ్రెస్​ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు ట్విస్ట్​ చేశారన్నారు. తాను కేవలం కాంగ్రెస్​ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్​ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది.

నందిగామలో నీటి కటకట - గొంతు తడపలేని శాశ్వత మంచినీటి పథకం - Drinking Water Problems

నిషేధంపై ఎన్నికల సంఘం వివరణ : కేసీఆర్​ ఇచ్చిన వివరణపై ఈసీ సంతృప్తిని చెందలేదు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ స్పష్టం చేసింది. గతంలోనూ ఎన్నికల సమయంలో కేసీఆర్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ తెలిపింది. పార్టీ అధినేతగా, స్టార్​ క్యాంపెయినర్​గా కేసీఆర్​ ఎన్నికల నియమావళిని పాటించి ఇతర నేతలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. అందుకే 48 గంటల పాటు బహిరంగసభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని నిషేధం విధించింది. ఈ నిషేధ ఆదేశాలు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి 48 గంటల పాటు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ 48 గంటలు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.