ETV Bharat / state

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 8:01 PM IST

BRS MLA Harish Rao Fires On Congress
BRS Leaders Meet on Lok Sabha Election 2024

BRS Leaders Meets On Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనంతో ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే హస్తం పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్‌ బీఆర్​ఎస్​దేనని ధీమా వ్యక్తం చేసిన నేతలు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

BRS Leaders Meet on Lok Sabha Election 2024 : వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభలో పాల్గొన్న కేటీఆర్​ అధికారంలోకి వచ్చినా రేవంత్‌రెడ్డి అనాగరిక భాష మారట్లేదని మండిపడ్డారు. 420హామీలతో గెలిచారన్న కేటీఆర్ కాంగ్రెస్‌ మాటల సర్కారే తప్ప చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని వెల్లడించారు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారని రేవంత్‌ రెడ్డి పూర్వాశ్రమం అదెనేమో తనకైతే తెలియదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి లాగా తాము తిట్టగలిగినా సంస్కారం అడ్డొస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు.

మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం చేతిలో పెట్టడమా : హరీశ్‌రావు

"కేసీఆర్​ అయితేనే హైదరాబాద్​, తెలంగాణ బాగుంటది. అభివృద్ధి గురించి ఇక్కడ ఓటు వేశారు. కానీ జిల్లాల్లో కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ ఇచ్చినా 420 హమీలు కొంతమంది మోసపోయారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వంమే చేతల ప్రభుత్వ కాదు. కేవలం బిల్డప్ ఇచ్చుకునే ప్రభుత్వం." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రకటించిన హామీలన్ని అమలు చేయాలి హరీశ్ రావు

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

BRS MLA Harish Rao Fires On Congress : కాంగ్రెస్‌ పార్టీ గోబెల్స్ ప్రచారంతోనే గెలిచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పటాన్‌చెరులో మెదక్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ సన్నాహక సమావేశానికి హాజరైన హరీశ్‌ మార్పు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమేనా అని దుయ్యబట్టారు. డిసెంబర్‌ నుంచి కరెంట్‌ బిల్లులు కట్టొద్దన్నారు కానీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లైనా రావన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్​ రెడ్డి

నిజంగా కాంగ్రెస్​కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 4వేల పింఛన్ ఇవ్వాలి. రెండు లక్షల రుణమాఫీ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారంగా అక్కాచెల్లెల్లకు నెలకు రెెండు వేల ఐదు వందలు ఇవ్వు. ఇవన్నీ చేస్తే మేము శభాష్ అంటాము. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము.

MLA Jagadish Reddy Slams Congress Government : కృష్ణా జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటోందని ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్​ విస్తృతస్థాయి సమావేశంలో జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు నేతలు వివరించారు. భవిష్యత్‌ బీఆర్​ఎస్​దేనని వెల్లడించిన నేతలు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఆ పని చేస్తేనే వాళ్లు హామీలు అమలు చేస్తారు- కాంగ్రెస్‌పై బాల్క సుమన్‌ ఫైర్‌

హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.