ETV Bharat / sports

పాక్ బోర్డు బిగ్ డెసిషన్​ - ఛాంపియన్స్ ట్రోపీ కోసం ఆ ఈ 3 నగరాలు - ICC Champions Trophy 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:17 PM IST

ICC Champions Trophy 2025
ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్కడి మూడు ముఖ్యమైన ప్రాంతాలను మ్యాచ్​ల కోసం ఎంపిక చేసింది. ఆ విశేషాలు మీ కోసం.

ICC Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగనున్న టోర్నీ కోసం ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖత చూపించింది. ఇందులో భాగంగా పాక్​లోని లాహోర్, రావల్పిండి, కరాచీలను ఎంపిక చేసింది. తమ షెడ్యూల్​తో పాటు ఈ నగరాల పేర్లను ఐసీసీకి పంపించింది.

ఇదిలా ఉండగా, ఐసీసీ భద్రతా బృందం పాకిస్థాన్​కు వచ్చి అక్కడి వేదికలను పరిశీలించిందట. అంతే కాకుండా వాళ్లు చేసిన ఏర్పాట్లను చూసి ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇక పాకిస్థాన్ చివరగా 1996 ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​నకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2009 ఛాంపియన్స్​ ట్రోపీ, 2011 వరల్డ్ కప్​ నిర్వహించే ఛాన్స్​ వచ్చింది. కానీ 2009లో లాహోర్​లో శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రదడి జరగడం వల్ల భద్రతా కారణాల రీత్యా ఆ రెండు ఈవెంట్​లను అక్కడి నుంచి తరలించారు. చివరిసారిగా 2012-2013లో టీమ్​ ఇండియా పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్​ భారత్‌లో పర్యటించింది. కానీ ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఇతర సమస్యల కారణంగా రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించారు. ఎందుకంటే టీమ్​ఇండియాను పాకిస్థాన్​కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో ఇలా చేశారు.

అయితే ఈ మెగా టోర్నీ కోసం వేదికను మార్చడం లేదా గత ఆసియాకప్ స్టైల్​లోనే హైబ్రిడ్ మోడల్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలానే సమీప భవిష్యత్‌లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం కష్టమేనని పేర్కొన్నారు.

"ద్వైపాక్షిక సిరీస్‌లు మరిచిపోవడమే. కనీసం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా టీమ్​ ఇండియా పాకిస్థాన్ గడ్డకు వెళ్లే ఛాన్స్​ లేదు. అవసరమైతే వేదిక మారుస్తారు. లేదంటే హైబ్రిడ్ మోడల్​ను ప్రతిపాదిస్తారు. టీమ్​ఇండియా పాకిస్థాన్ వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కచ్చితంగా కావాల్సిందే. ప్రస్తుతం పాకిస్థాన్‌తో సత్సంబంధాలు సరిగ్గా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఐసీసీ ఈవెంట్. కాబట్టి దీన్ని బీసీసీఐ డీల్ చేయడం కాస్త కష్టమే. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా సమీప భవిష్యత్‌లో ఉండటం కష్టమే. అది అసాధ్యం."అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్​లోనే 2025 ఛాంపియన్స్​ ట్రోఫీ- భారత్​ రియాక్షన్​పై ఉత్కంఠ!

పాకిస్థాన్​కు షాక్!- ఐస్​లాండ్​లో ఛాంపియన్స్​ ట్రోఫీ- ఇదంతా భారత్ పనేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.