ETV Bharat / politics

సీఎం రేవంత్ రెడ్డి​పై డీకే అరుణ సీరియస్​ - ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ - DK Aruna Serious on CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 6:21 PM IST

Lok Sabha Elections 2024
DK Aruna Fires on CM Revanth Reddy

DK Aruna Fires on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యక్తిగతంగా తనను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం పదవిని, పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడుకునేలా వ్యవహరించుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చి గెలుస్తారా? అని అరుణ ప్రశ్నించారు.

DK Aruna Fires on CM Revanth Reddy : మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ఓటమిని ఒప్పుకున్నారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. అభద్రతాభావం వారిని వెంటాడుతున్నందునే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డీకే అరుణ, ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్ష నేతగానే (Opposition Leader) మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు - డీకే అరుణ - Lok Sabha Election 2024

మహిళ అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీకే అరుణ పేరు తీసే అర్హత కూడ లేదని, దొరసాని అనే మాట మాట్లాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయంగానే హుందాగ వ్యవహరించాలని, వ్యక్తిగతమైన విమర్శలు (Personal Criticism), ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదని హెచ్చరించారు.

"మహబూబ్​నగర్​ పార్లమెంట్​ ఎన్నికపై రేవంత్​ రెడ్డి ఓటమి ఒప్పుకున్నారు. అందుకే నాపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా, దొరసాని అని నోటికి వచ్చినట్లు ఒక సీఎం మాట్లాడటం సిగ్గుచేటు. ఈ మాట అన్నందుకు మీరు కచ్చితంగా నాకు క్షమాపణ చెప్పాలి. ఇది ఇలానే కొనసాగితే ఊరుకోవటానికి డీకే అరుణ సిద్ధంగా లేదు."- డీకే అరుణ, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి

సీఎం రేవంత్ రెడ్డి​పై డీకే అరుణ సీరియస్​ - క్షమాపణ చెప్పాలని డిమాండ్​

BJP Leader DK Aruna Comments on Congress : పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై ప్రశ్నిస్తున్న అధికార పక్షం, ముందనుకున్న డీపీఆర్‌ ప్రకారం పనులు చేపడితే ఇప్పటికైనా జాతీయ హోదా (National Status) వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి తెలియని కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

కేంద్రంలో రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు అయ్యేది లేదన్నారు. ప్రజల సమస్యలను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోకుండా కేవలం రాజకీయమే మాట్లాడుతున్నారని విమర్శించారు. 200 ఓట్లు లేని కాంగ్రెస్‌ పార్టీ, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ద్వారా కాకుండా ఏ విధంగా గెలుస్తుందో చెప్పాలన్నారు.

మేం ఒంటరిగానే పోటీ చేస్తాం - పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆపే శక్తి ఎవరికీ లేదు : డీకే అరుణ

చేరికలు, బస్సు యాత్రలు, నారీ శక్తి వందన్​తో ప్రజల్లోకి - ఫిబ్రవరి నెలంతా బీజేపీ బిజీబిజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.