ETV Bharat / politics

బీఆర్ఎస్ అవినీతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం - కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులకు నేడు అవగాహన కార్యక్రమం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 2:04 PM IST

CM Revanth Reddy Meeting MLAs and MLCs Today : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గత సర్కార్‌ నిర్మించిన ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున దోపిడీ జరిగిందంటూ ఇంటింటికీ ప్రచారం చేయనుంది. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై నేడు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పీసీసీ అవగాహన కల్పించనుంది. ప్రభుత్వ వైఖరిని వారికి స్పష్టం చేయనుంది.

Etv Bharat
Etv Bharat

ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతిపై అవగాహన

CM Revanth Reddy Meeting MLAs and MLCs Today : రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పీసీసీ పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం, ప్రతిపక్షాలపై గట్టిగా ఎదురు దాడి చేసేట్లు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను లోక్​సభ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఈరోజు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పీసీసీ అవగాహన కల్పించనుంది.

Congress Awareness Program on BRS Corruption : కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​ను (Telangana Budget 2024) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పది సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా ప్రభుత్వ వ్యవస్థలను బీఆర్ఎస్ సర్కార్‌ ఎలా నిర్వీర్యం చేసిందో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అవగాహన కల్పించనున్నారు. ఈ రెండు నెలల్లో పాలనాపరంగా చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, నిర్వీర్యమైనట్లు చెబుతున్న వ్యవస్థలను చక్కబెట్టేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు గురించి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వారికి వివరిస్తారు. కాంగ్రెస్‌ సర్కార్ వైఖరిని ప్రజాప్రతినిధులకు ఆయన స్పష్టం చేయనున్నారు.

కేసీఆర్​ సర్కార్​ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు

Congress Awareness BRS Corruption to Party Representatives : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటి పురోగతి, వాటికైన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని వివరించనున్నారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని ఉత్తమ్​కుమార్ రెడ్డి వారికి స్పష్టం చేయనున్నారు.

కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం - రేవంత్ రెడ్డి సెటైర్

ముందుగా ప్రకటించినట్లుగా తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టును సృష్టించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివరించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎలిమినేటి మాధవరెడ్డి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు ఎల్ఐఎస్, రాజీవ్ భీమా ఎల్ఐఎస్​, కోయిల్ సాగర్ ఎల్ఐఎస్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ స్కీమ్ కొమురం భీం, చిన్న కాళేశ్వరం వంటి ఇతర ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలియజేస్తారు. మరోవైపు అన్ని అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతుతున్నాయి.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కేసీఆర్‌ అక్రమాలకు పాల్పడ్డారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఊరూరా చాటిచెప్పాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులను రాష్ట్ర సర్కార్ కృష్ణా బోర్డుకు అప్పగించిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం - ఆ 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం 'ఆకర్ష్' వ్యూహం!

చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్​'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.