ETV Bharat / politics

'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్​లో బీఆర్​ఎస్ ​- బీజేపీ మధ్యే పోటీ'

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 4:19 PM IST

Updated : Mar 4, 2024, 3:50 PM IST

Former CM KCR Meeting with BRS Leaders : లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్​ఎస్, బీజేపీ మధ్యనేనని తెలిపారు. ఈ నెల 12న కరీంనగర్​లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

CM KCR Meeting with BRS Leaders
CM KCR Meeting with BRS Leaders

Former CM KCR Meeting with BRS Leaders : లోక్​సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి ఈ నెల 12వ తేదీన పూరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఉద్యమకాలం నుంచి సెంటిమెంట్​గా కలిసి వస్తున్న కరీంనగర్ ఎస్​ఆర్​ఎస్​ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ(BRS Public Meeting) నిర్వహించాలని కరీంనగర్ లోక్​సభ నియోజకవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. లోక్​సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాల విషయమై కరీంనగర్, పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆయన హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​​లో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్​రావు, వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, ఎల్.రమణ, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్న కేసీఆర్​ శాసనసభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, అధైర్యపడొద్దని నేతలు, కార్యకర్తలకు సూచించారు. లోక్​సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్​ఎస్​ కచ్చితంగా గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్కడ బీఆర్​ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాను రోడ్​షో(Road Shows)ల్లో పాల్గొంటానని కేసీఆర్​ తెలిపారు.

బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఖరారు

BRS Public Meeting in Karimnagar on March 12 : మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు కేసీఆర్​ చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని, అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని అన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో లేకపోవడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, గులాబీ పార్టీతోనే మేలు జరుగుతుందన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమేనని కేసీఆర్​ అన్నారు. మధ్య మానేరులో కూడా సమస్యలు వస్తే బీఆర్​ఎస్​ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసినట్లు గుర్తు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కా : సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలి కానీ, రాజకీయం చేయడం తగదని మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. ఒక్క పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకించుకోలేము కదా అని ప్రశ్నించారు. ఎల్​ఆర్​ఎస్​ విషయంలో గతంలో బీఆర్​ఎస్​ను నిందించిన కాంగ్రెస్​ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అదే చేస్తోందని, గతంలో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్​ ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ ఉచితంగా చేయాలని కోరారు. 1989లో ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా 1994లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా అసెంబ్లీ సీట్లలో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ఎంతో మంది నాయకులను తయారు చేసిందని, అధికారంలో లేమని కొంతమంది నేతలు అటుఇటు పోవచ్చని, కేడర్​ మాత్రం అలాగే ఉందని కేసీఆర్​ పేర్కొన్నారు.

ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే 'ఎంపీ' గెలుపు గుర్రాలెవరు? - ఉమ్మడి పాలమూరులో ఇప్పుడిదే హాట్​టాపిక్

కారు జస్ట్ సర్వీసింగ్​కు వెళ్లింది - త్వరలో జెట్​ స్పీడ్​లో దూసుకొస్తుంది : కేటీఆర్​

Last Updated :Mar 4, 2024, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.