ETV Bharat / business

MG నుంచి మరో 3 ఎలక్ట్రిక్ కార్స్ - ఒక స్పోర్ట్స్ కార్, ఫ్యామిలీస్ కోసం 2 మోడల్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 1:10 PM IST

Updated : Mar 20, 2024, 3:22 PM IST

MG Cyberster electric sportscar
MG Motor India has Display 3 New EV Cars

MG Displays 3 New EV Cars In India : కార్ లవర్స్​కు గుడ్ న్యూస్​. ఎంజీ మోటార్ ఇండియా బుధవారం 3 సరికొత్త ఈవీ కార్లను ప్రదర్శించింది. వీటిలో ఎంజీ 4, ఎంజీ 5 సాధారణ ఎలక్ట్రిక్ కార్లు కాగా, ఎంజీ సైబర్​స్టర్ అనేది స్పోర్ట్స్ ఈవీ కారు.

MG Displays 3 New EV Cars In India : ఎంజీ మోటార్ ఇండియా 'MG 2.0' ఇనీషియేటివ్​లో భాగంగా బుధవారం మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రదర్శించింది. అవి : ఎంజీ 4, ఎంపీ 5, ఎంజీ సైబర్​స్టర్​. వీటిలో ఎంజీ సైబర్​స్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ కార్ కావడం గమనార్హం.

త్వరలోనే లాంఛ్​!
వాస్తవానికి ఎంజీ మోటార్ ఇండియా తాము రూపొందించిన ఎంజీ 4 ఈవీని 2023 ఆటో ఎక్స్​పోలోనే ప్రదర్శించింది. మళ్లీ ఇప్పుడు మిగతా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్​(ఎంజీ 5, ఎంజీ సైబర్​స్టర్​)తో కలిపి మరోసారి దానిని ప్రదర్శించింది. త్వరలోనే వీటిని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవే కనుక లాంఛ్ అయితే ఎంజీ కోమెట్​, ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ కార్ల సరసన ఇవి చేరతాయి.

MG 4 EV Features :
ఎంజీ ఈవీ ఎక్స్​టీరియర్ చూడడానికి స్లీక్ లైన్స్​తో, పాలిష్డ్ సర్ఫేస్​తో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిని సైబర్​స్టర్​ రోడ్​స్టర్​ కాన్సెప్ట్​ను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని తీర్చిదిద్దారు.

ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనిలో రెండు ఫ్లోటింగ్ స్క్రీన్​లను అమర్చారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​, రెండోది ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​. దీనిలో సెంటర్​ కన్సోల్​, రోటరీ డయెల్​, వైర్​లెస్​ ఛార్జింగ్ ప్యాడ్​ ఉన్నాయి. అలాగే దీనిలో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్​ ఫ్రంట్​ సీట్​, ఏడీఏఎస్​ టెక్నాలజీలను పొందుపరిచారు.

MG 4 EV Powertrain Range :
ఈ ఎంజీ 4 ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. అవి: 51 కిలోవాట్​, 64 కిలోవాట్​ సామర్థ్యం గల బ్యాటరీలు. ఇవి వరుసగా 170 హెచ్​పీ, 203 హెచ్​పీ పవర్​ను జనరేట్ చేస్తాయి. ఈ రెండు వెర్షన్​లు కూడా 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్ చేస్తాయి. ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్​కు కూడా సపోర్ట్ చేస్తాయి. 150 కిలోవాట్​ డీసీ ఛార్జర్​తో వీటిని ఫాస్ట్​ ఛార్జ్​ చేయవచ్చు. 51 కిలోవాట్​ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 డ్రైవింగ్​ రేంజ్​ 350 కి.మీ; 51 కిలోవాట్​ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 రేంజ్​ 452 కి.మీ రేంజ్​ ఉంటుంది.

ఎంజీ+జేఎస్​డబ్ల్యూ
భారతదేశ ఉక్కు పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన జిందాల్​ గ్రూప్​ (జేఎస్​డబ్ల్యూ), ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మోరిస్​ గ్యారేజ్​ (ఎంజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్​, హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. ముంబయిలో నిర్వహించిన ఈవీ కార్ల ప్రదర్శన సందర్భంగా విషయాన్ని ప్రకటించాయి.

ప్రతి నాలుగు నెలలకో కొత్త కారు లాంఛ్!

"జేఎస్​డబ్ల్యూ కంపెనీ ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద స్టీల్ కంపెనీ. భారత్​లో అయితే రెండో లార్జెస్ట్ కంపెనీ. మాకు 23 బిలియన్ డాలర్ల మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు మేము ఎంజీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం. ఇప్పుడు మేము హైబ్రిడ్​, ఎలక్ట్రిక్ కార్ల తయారుచేస్తాం. ప్రస్తుతానికి పట్టణాల్లో మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాల్లో అవి లభించడం లేదు. అందుకే మేము హైబ్రీడ్​ కార్లను రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఈ సెప్టెంబర్​ నుంచి ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒక కొత్త కారు లాంఛ్ చేస్తాం. అంతే కాదు వాటిని విదేశాలకు కూడా ఎక్స్​పోర్ట్ చేస్తాం."
- సజ్జన్​ జిందాల్​, జేఎస్​డబ్ల్యూ ఛైర్మన్​

మారుతి సుజుకిని మించి!!
'1984లో మారుతి సుజుకి కంపెనీ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. ఫియట్​, అంబాసిడర్​ కార్లను వెనక్కు నెట్టి మారుతి కార్లను ప్రజలకు చేరువ చేసింది. ప్రస్తుతం 50% దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీని తన కంట్రోల్​లో ఉంచుకుంది. ఇప్పుడు మేము కూడా మారుతిలాగానే ఎలక్ట్రిక్ వాహనాల ప్రొడక్షన్​లో ఒక పెద్ద విప్లవం తీసుకువస్తాం. త్వరలోనే సరికొత్త టెక్నాలజీతో జేఎస్​డబ్ల్యూ-ఎంజీ ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారను లాంఛ్ చేస్తాం' అని జేఎస్​డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్​ జిందాల్​ పేర్కొన్నారు.​

వేసవిలోనూ ఎలక్ట్రిక్ వెహికల్​​ మంచి కండిషన్​లో ఉండాలా? ఈ 5 ప్రో టిప్స్ మీ కోసమే!

కొత్త కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 వెహికల్స్​ ఇవే!

Last Updated :Mar 20, 2024, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.